రైతులకు అండగా కేసీఆర్ : ఎర్రబెల్లి

రైతులకు అండగా కేసీఆర్ : ఎర్రబెల్లి
పాలకుర్తి/పాలకుర్తి రూరల్ జనవరి 11: రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే నిదర్శనంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే బుధవారం సాయం త్రం పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా తన కోరిక మేరకు సీఎం కేసీఆర్ మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.లక్ష అందించారన్నారు. అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రి టి. హరీశ్‌రావు కొడకండ్ల మార్కెట్ కమిటీ నుంచి రూ.లక్ష అందజేశారన్నారు.

దహ న సంస్కారాల ఖర్చు కింద బాదావత్ బోజ్యా, గుగులోతు బిచ్చాలకు మార్కెట్ కమిటీ నుంచి రూ.20వేలు అందజేశానన్నారు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందుతుందని చెప్పారు. దెబ్బలు తగిలిన వారికి రూ.10వేలు అందజేశామన్నారు. చికిత్స ఖర్చులను ప్రభు త్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ముస్కు రాంబా బు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు నల్లానాగిరెడ్డి, కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ముత్తినేని రమాదేవి శ్రీనివాస్, ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్, వైస్ ఎంపీపీ గూడ దామోదర్, సింగారపు దీపక్, పసులాది వెంకటేశ్, దళిత రత్న అందె యాకయ్య, పుస్కూరి శ్రీనివాసరావు, కమ్మగాని నాగన్న, దారవత్ యాకూబ్,మార్కెట్ సిబ్బంది సోమశేఖర్, నాగర్జున పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'