రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.. 


>>  మల్లూరు గుట్టపై చారిత్రక ఆనవాళ్లు గుర్తింపు
మంగపేట,  జయశంకర్‌ జిల్లా మంగపేట మండలం మల్లూరు గుట్టపై చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. గుట్టకు నలుదిక్కులా భారీ కుడ్యం, ధాన్యాగారం, కోట, రాక్షసగుహలు, చెరువులు, కుంటలు, సొరంగ మార్గాలు.. ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన నిర్మాణాలున్నాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవునా వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గుట్టపై భారీ కుడ్యం(గోడ) ఉన్న విషయాన్ని ఇటీవలే గుర్తించారు. ఇది మూడు కిలోమీటర్ల నిడివితో కోటచుట్టూ విస్తరించి ఉంది. మల్లూరు గుట్ట చుట్టూ ఉన్న గడెలగుట్ట, సంగంపల్లి మొకిరెగుట్ట, గుడ్డేలుగాల గుట్ట, నర్సింహస్వామి బాడువల గుట్టలున్నాయి. వీటన్నింటిని మల్లూరు గుట్టలుగానే పరిగణిస్తారు. కాకతీయులు వారి చివరి అంకంలో సేన బస్తర్‌కు వలస వెళ్లే క్రమంలో కొంతకాలం ఇక్కడే ఉండేందుకు రక్షణ కోసం కోట చుట్టూ గోడ నిర్మించినట్లు తెలుస్తోంది. గుట్టపై సుమారు మూడు వేల గుహలు, ప్రతి గుహలో నీటితొట్లు ఉన్నాయి. వీటిని కాకతీయ రాజులు గుర్రపు శాలలుగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. మల్లూరు గుట్ట లక్ష్మీనరసింహస్వామివారు, అమ్మవార్ల నగలను కాపాడేందుకు ఆ కాలంలోనే రాతి సొరంగం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ కుడ్యం ఉందని తెలవడంతో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.

Comments

Popular posts from this blog

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'