Posts

Showing posts from January, 2017

మనోళ్లు పనికిరారా?: కోదండరాం

Image
కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకేనా?  హైదరాబాద్‌:  ‘‘హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ పంపిణీ చేసిన చెత్తడబ్బాల కాం ట్రాక్టు ఆంధ్రా వాళ్లకే.. మన ఊరిలో చెరువులు బాగు చేయించే పనులు వాళ్లకే.. చెత్త డబ్బా లను తయారు చేయడానికి, ఊళ్లో చెరువుల్లో మట్టి ఎత్తిపోయడానికి కూడా మన వాళ్లు పనికిరారా..?’’ అని టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం ప్రశ్నించారు. మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు తెలంగాణ వారికి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మిషన్‌ భగీరథ పైపులు ఎక్కడ తయారవు తున్నాయో, ఎక్కడ్నుంచి వస్తున్నయో తెలియడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపైకి కట్టె పట్టుకుని మీదకు ఉరికి వచ్చిన వాళ్లే పదవుల్లో ముందున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) రూపొందించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణకు అడ్డంపడి, ఉద్యమకారులపై దాడులు చేసిన శక్తులే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అధిపత్యం చెలాయిస్తున్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు, ఉద్యమ వ్యతిరేకులకు మధ్య ఘర్షణ జరుగుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరడంలేదని పేర్కొన్నారు. సోలార్‌...

జాతరలో కీలక ఘట్టం

Image
జాతరలో కీలక ఘట్టం అదిలాబాద్‌: నాగోబా జాతరలో కీలక ఘట్టమైన ప్రజా దర్బార్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో పాల్గొనడానికి గిరిజనులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అటవీ ప్రాంతమంతా భక్తులతో కిటకిట లాడుతోంది. కాగా ప్రజా దర్భార్‌ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

'ఎమ్మెల్యేను పరుగుపెట్టించాయి'

Image
'ఎమ్మెల్యేను పరుగుపెట్టించాయి' చందంపేట: అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేతో పాటు నాయకులు, కార్యకర్తలను తేనెటీగలు పరుగులు పెట్టించాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాచరాజుపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రనాయక్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు అక్కడి ఆకుపచ్చ గుహలను పరిశీలించేందుకు వెళ్లారు. గుహలను పరిశీలిస్తుండగా అలికిడితో తేనెటీగలు ఒక్కసారిగా వారందరి వెంట పడ్డాయి. దీంతో వారు తలోదిక్కుకు పరుగులు తీశారు. ఎమ్మెల్యేతోపాటు కొందరు దగ్గరలోనే ఉన్న వాహనాల్లోకి వెళ్లి అద్దాలు బిగించుకున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కు స్వల‍్ప గాయాలయ్యాయి.

ఏటీఎంల్లో క్యాష్ విత్ డ్రా పరిమితులు ఎత్తివేత

Image
ఏటీఎంల్లో క్యాష్ విత్ డ్రా పరిమితులు ఎత్తివేత ►  ఏటీఎం నుంచి ఇక 10 వేలు ►  అయితే.. వారానికి 24 వేలే! ►  కరెంట్‌ అకౌంట్ల పరిమితి రూ. లక్షకు పెంపు ►  పాత నోట్లు డిపాజిట్‌ చేసుకునేందుకు ఎన్నారైలకు అదనపు సమయం ముంబై: ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రూ. 10 వేలకు పెంచుతూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వారంలో విత్‌డ్రా పరిమితి రూ. 24 వేలను కొనసాగించింది. అలాగే కరెంట్‌ అకౌంట్ల నుంచి వారానికి రూ. లక్ష వరకు తీసుకోవచ్చని వెల్లడించింది. దీంతో చిన్న స్థాయి వర్తకులకు కాస్త ఊరట లభించనుంది. ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే పెద్ద నోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, దేశ పౌరులకు తమ వద్ద ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు ఆర్బీఐ అదనపు సమయం ఇచ్చింది. నవంబర్‌ 9న పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2,500గా ఉన్న విత్‌డ్రా పరిమితిని ఆర్బీఐ జనవరి 1 నుంచి రూ. 4,500కు పెంచిన సంగతి తెలిసిందే. కరెంట్‌ అకౌంట్లలో వారానికి రూ. 50 వేలుగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. లక్ష...

టెలికాం ఇండస్ట్రీలో మరో భారీ విలీనం

Image
టెలికాం ఇండస్ట్రీలో మరో భారీ విలీనం న్యూఢిల్లీ :  టెలికాం ఇండస్ట్రీ మొత్తం తమ చెప్పుచేతల్లో నడవాలని భావిస్తున్న టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కు, కొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ అయిన జియోకు పెద్ద ముప్పు ఎదురుకాబోతుంది. మరో రెండు దేశీయ టెలికాం దిగ్గజాలు ఐడియా, వొడాఫోన్ లు ఒకటి కాబోతున్నాయి. వొడాఫోన్ ను ఐడియాలో విలీనం చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ తో చర్చలు సాగుతున్నాయని బ్రిటిష్ దిగ్గజం క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ రెండు కంపెనీలు చేతులు కలుపబోతున్నాయని మార్కెట్లోనూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను ధృవీకరిస్తూ వొడాఫోన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసేసింది. దీంతో రెండు కంపెనీల మధ్యే ఉంటుందన్న పోటీ త్రిముఖంగా మారింది. ఇన్నిరోజులు నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ తో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియో పోటీపడుతోంది. ఎయిర్ టెల్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.   ఇటీవల విడుదైన ఫలితాల్లోనూ ఎయిర్ టెల్ లాభాలకు జియో ఏ మేర గండికొడుకుతుందో అర్థమైంది. ప్రస్తుతం ఐడియాలో వొడాఫోన్ విలీనమైతే నెంబర్ వన్ స్థానం కోసం మూడు దిగ్గజాలు పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది.  బ్రిటీష...

మెడికల్ కాలేజీని కేసీఆర్, హరీశ్‌రావులు సిద్ధిపేటకు తరలించుకుపోయారు

Image
మెడికల్ కాలేజీని కేసీఆర్, హరీశ్‌రావులు సిద్ధిపేటకు తరలించుకుపోయారు సంగారెడ్డి: సంగారెడ్డికి మంజూరైన మెడికల్ కాలేజీని సిద్ధిపేటకు తరలించడం దారుణంమంటూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, హరీశ్ రావు ఇద్దరూ కలిసి మెడికల్ కాలేజీని సిద్ధిపేటకు తరలించుకుపోయారన్నారు. మెడికల్ కాలేజీ కోసం ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసమర్థతతోనే సంగారెడ్డికి మంజూరైన మెడికల్ కాలేజీ సిద్ధిపేటకు తరలిపోయింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక ఒక్కసారి కూడా సంగారెడ్డికి రాలేదన్నారు. సంగారెడ్డి తెలంగాణలో లేదనుకుంటున్నారేమే అనిఅన్నారు. మెడికల్ కాలేజీని సంగారెడ్డికి తరలించేంత వరకూ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు‌ సంగారెడ్డికి వస్తే అడ్డుకుంటామన్నారు.

కొట్లాడినోడు ఎక్కడ్నో పోయిండు:కోదండరాం

Image
కొట్లాడినోడు ఎక్కడ్నో పోయిండు : కోదండరాం మనల్ని కొట్టినోడు కుర్చీలో కూర్చుండు ప్రజల ఆకాంక్షలను గుర్తించాలి హైదరాబాద, తెలంగాణ:రాష్ట్ర సాధన కోసం కొట్లాడినోడు ఎక్కడ్నో పోయిండు.. మనకు అడ్డం పడ్డోడేమో ముందుకు వచ్చిండు అనే ఆవేదన ప్రజల్లో పెరుగుతోంది. ఉద్యమంలో ముందుకు సాగుతున్నవారిని కట్టె పట్టుకుని కొట్టినోడు కుర్చీలో కూర్చున్నడనేది వాస్తవం’’ అని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఇలాంటి వారితో ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోతదా? అనే మీమాంస బలపడుతోందన్నారు. ప్రజలను చైతన్య పరచాలని, ఉద్యమ వారసులమని ప్రకటించుకుని ధైర్యంగా ముందుకు సాగడమే తమ ముందున్న బాధ్యత అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక డైరీని కోదండరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర కార్పొరేట్ల పెత్తనం ఇంకా కొనసాగుతోందని, వలసాధిపత్య పాలకుల విధానాలనే మన సర్కారూ కొనసాగిస్తోందన్నారు. ఆ పద్ధతిని మానుకుని ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా నూతన అభివృద్ధి నమూనాను రూపొందించుకోవాలని హితవు పలికారు....

యాంకర్ లాస్యకు కాబోయే భర్త ఇతడే....

Image
యాంకర్ లాస్యకు కాబోయే భర్త ఇతడే.... బుల్లితెరపై స్టార్‌ స్టేటస్‌ అందుకున్న యాంకర్‌ లాస్య. బుల్లితెర ప్రోగ్రామ్స్‌తో, ఆడియో ఫంక్షన్లతో బిజీగా ఉన్న సమయంలోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది లాస్య. ఆమె నిశ్ఛితార్థ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ఆ ఫోటోలను తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది లాస్య. వరుడి పేరు మంజునాథ్ అని, అతడు మరాఠి యువకుడని పేర్కొంది. జనవరి 29న ఆదివారం తమ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగిందని లాస్య చెప్పింది. అంతకు ముందు తన అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచడానికి తన చేతిపై ‘మంజు’ అని, కాబోయే భర్త చేతిపై ‘చిన్ని’ అని రాసి ఉన్న ఫోటోను పోస్ట్‌ చేసింది. అనంతరం అభిమానులు రిక్వెస్ట్ చేయడంతో సాయంత్రం 5 గంటలకు తన ఎంగేజ్ మెంట్ ఫొటోలను పోస్ట్ చేసి, తనకు కాబోయేవాడి గురించి తెలియజేసింది.

సోషల్ సైట్స్ లల్లో చెక్కర్లు కొడుతున్న జనసేన టీసర్స్

సోషల్ సైట్స్ లల్లో చెక్కర్లు కొడుతున్న జనసేన టీసర్స్ amr news telangana/ ఏపీ: అతనఅనుకునేది వేరు... ఆతను మార్గదర్శం ఇచ్చేది వేరు... మేమందరం అయన వైపే.  అంటూ సోషల్ సైట్స్ లల్లో జనసేన ప్రోమోలు చెక్కర్లు కొడుతున్నాయి.. ఇంతే కాకుండా యువకులుముసలి వాళ్ళు కూడా అతని మార్గదర్శకాలపై నే మొగ్గుచూపుతున్నారు. https://youtu.be/g0jwR93Zn9Y https://youtu.be/g0jwR93Zn9Y

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'

Image
హైదరాబాద్‌:  తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మతపరమైన రిజర్వేషన్లను తెరపైకి తెస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు.   ఎట్టి పరిస్థితుల్లో మతపరమైన రిజర్వేషన్లను అమలు కానివ్వమని స్పష్టం చేశారు. పేద ముస్లింల అభివృదికి తాము వ్యతిరేకం కాదన్నారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే టీఆర్‌ఎస్‌ ఈ అంశాన్ని లేవనెత్తిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ దళితులపై వివక్ష చూపుతోందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో తాడో పేదో తేల్చుకుంటామని హెచ్చరించారు. రానున్న మూడు నెలల్లో మండలస్థాయిలో ప్రభుత్వంపై ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.

నేడు ‘ఫీజు’ పోరు

Image
•  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో •  4వేల మందితో మహాధర్నా AMR NEWS TELANGANA/ హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ కమిటీ ఆరోపించింది. అసెంబ్లీ సాక్షిగా రూ.3,068 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను గతేడాది ఏప్రిల్‌ 1లోగా చెల్లిస్తానన్న సీఎం కేసీఆర్‌ నేటికీ దాన్ని అమలు చేయలేదంది. ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకోవాలని కోరుతూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద నాలుగు వేల మందితో మహాధర్నా నిర్వహిస్తు న్నామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థు లకు కూడా ఉన్నత విద్యనందిం చాలనే ఉద్దేశంతో నాడు వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారన్నారు. గతంలో 16 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం దరఖాస్తు చేసుకుంటే.. 2016–17లో ఆ సంఖ్య 12.97 లక్షలకు ఎందుకు తగ్గిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదంటూ వందలాది మంది విద్యార్థులు తమ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపా...

రాష్ట్రంలో కుటుంబ పాలన - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Image
AMR NEW S TS: తాడ్వాయి: ‘ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది.. రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్‌ మాటలతో గారడీ చేస్తున్నాడని, ప్రజలు బతుకు తెలంగాణ కోరుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ప్రజల కష్టాలు ఏసీలో కూర్చున్న కేసీఆర్‌కు ఏం తెలుస్తాయని ధ్వజమెత్తారు.  ఈ పాదయాత్ర ద్వారా కేసీఆర్‌కు కనువిప్పు కలగాలని అన్నారు. కాగా గిరిజనులు  సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌: మూడు నెలలు ఉచిత కాల్స్‌

Image
బీఎస్‌ఎన్‌ఎల్‌: మూడు నెలలు ఉచిత కాల్స్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వం టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల కోసం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.149తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్‌కాల్స్‌(లోకల్‌/ఎస్టీడీ)ను 30రోజుల పాటు పొందవచ్చు.  అయితే ఇతర నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలు మించి వాయిస్‌కాల్స్‌ చేసుకునే వెసులుబాటు లేదు. అంతేకాకుండా రూ.439తో రీఛార్జ్‌ చేయడం ద్వారా మూడు నెలల పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌ను చేసుకోవచ్చు. తాజా పథకం జనవరి 24వ తేదీ నుంచి కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వినియోగదారులకు వర్తిస్తుంది.

దేశ్ బచావో పోస్టర్ విడుదల చేసిన పవన

Image
AMR NEWS TELANGANA /PAVAN TWIT:జనసేన అధినేత పవన​ కళ్యాణ్  తనదైన శైలిలో ప్రత్యేక హోదా సాధనకు సిద్ధమవుతున్నారు. జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధం కావాలని పిలుపునివ్వడంతో పాటు జనసేన నిరసనను మ్యూజికల్ ఆల్బం ద్వారా వ్యక్తం చేస్తున్నట్టు  వెల్లడించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకు  ఈ  ఆల్బమ్ ను విడుదల  చేస్తున్నట్టు  తన ట్విట్టర్లో ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టు కోకపోతే, తిరగబడతామని తెగేసి చెబుతున్న పవర్‌ స్టార్‌  ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 26న విశాఖ ఆర్కేబీచ్ లో జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతీ ఆంధ్రుడు ఓ సైనికుడై కదలి రావాలన్నారు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆల్బమ్ ద్వారా జనసేన గళాన్ని వినిపించిననున్నట్లు పవన్ తన ట్వీట్‌​ లో తెలిపారు. జనసేన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా  ఒక మ్యూజికల్​ ఆల్బంను రిలీజ్‌ చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి దేశ్ బచావో అనే నినాదంతో పోస్టర్‌ ను ట్విటర్ లో  పవన్‌  పోస్ట్‌  చేశారు. తొలుత ఫిబ్రవరి 5న ఆల్బమ్ విడుదల చేయాలని ...

జనగామ మార్కెట్లో మంత్రి ఆకస్మిక పర్యటన

Image
రైతులకు అండగా నిలుస్తాం > హరీశ్‌రావు సమక్షంలో కందుల కొనుగోలుకు అధికారుల పరిశీలన.. ఆపై నిలిపివేత జనగామ: మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు శుక్రవారం జనగామ మార్కెట్‌ను ఆకస్మికంగా సందర్శించడంతో రెండు రోజులుగా తిప్పలు పడుతున్న రైతులకు ­రట లభించింది. ఎఫ్‌సీఐ, హాకా ఆధ్వర్యంలో జరగాల్సిన కొనుగోళ్లు అధికారులపై రైతుల ఆగ్రహం, ఘర్షణ వాతావరణం కారణంగా శుక్రవారం నిలిచిపోయాయి. యార్డులో కందులు, వేరుసెనగ రాశులు పేరుకుపోవడంతో శనివారం మార్కెట్‌కు సెలవు ప్రకటించి, అన్నదాతలను సరకులు తేవద్దని ప్రకటించాల్సి వచ్చింది. సోమవారం వరకు మద్దతు ధరతో కందుల ఖరీదు జరిగే అవకాశాలు లేవనే ప్రచారంతో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో మంత్రి హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి మార్కెట్‌యార్డును సందర్శించారు. వచ్చీరాగానే:  కొత్త పాలకవర్గం ఏర్పడిన అనంతరం తొలిసారి మార్కెటింగ్‌ మంత్రి వస్తున్నారనే సమాచారంతో ఆయనకు స్వాగతం పలికేందుకు జేసీ గోపాలకృష్ణప్రసాదరావు, డీసీపీ వెంకన్న, ఏసీపీ పద్మనాభరెడ్డి, మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ బి.పద్మ, మార్కెటింగ్‌ జిల్లా అధికారి నాగేశ్వరశర్మ, తెరాస పట్టణాధ్యక్షుడు బండయాదగి...

పదే పదే.. అదే అదే!

Image
>  రసాభాసగా జడ్పీ సర్వసభ్య సమావేశం   >  నాలుగు అంశాలపైనే చర్చ   >  నిధులు రావడం లేదని కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన గ తంలో ఒక కలెక్టరే పోడియంపై కూర్చుండే వారు. ప్రస్తుతం వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌ కలెక్టర్లు జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌కు బదులుగా జేసీ అమయ్‌కుమార్‌ ఆశీనులయ్యారు.   *  వచ్చే సమావేశం నాటికి మిషన్‌ భగీరథ ద్వారా జనగామ జిల్లాలోని గ్రామాలకు నీటిని అందిస్తే కలెక్టర్‌ శ్రీ దేవసేనను సన్మానించాలని శ్రీహరి ప్రకటించారు.   *  జడ్పీ ఛైర్‌పర్సన్‌, మంత్రులు, కలెక్టర్‌, సీఈవోలకు మహారాజ కుర్చీలను వేసేవారు. ప్రస్తుత సమావేశంలో సాధారణ కుర్చీలు వేసి తువ్వాళ్లను కప్పారు.   *  సమావేశానికి వచ్చిన కలెక్టర్లకు జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మ పుష్పగుచ్ఛం ఇచ్చి వేదికపైకి ఆహ్వానించారు.   *  గత సమావేశాల్లో ఎజెండాకు ఒకే పుస్తకం ఉండేది. ప్రస్తుతం ఐదు పుస్తకాలను తయారు చేశారు.   *  పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ను వాడవద్దని ప్రభుత్వం చెప్పింది. అయినా సమావేశం మందిరంతో పాటుగా ద్వారం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశ...

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

Image
రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు..   >>  మల్లూరు గుట్టపై చారిత్రక ఆనవాళ్లు గుర్తింపు మంగపేట,  జయశంకర్‌ జిల్లా మంగపేట మండలం మల్లూరు గుట్టపై చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. గుట్టకు నలుదిక్కులా భారీ కుడ్యం, ధాన్యాగారం, కోట, రాక్షసగుహలు, చెరువులు, కుంటలు, సొరంగ మార్గాలు.. ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన నిర్మాణాలున్నాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవునా వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గుట్టపై భారీ కుడ్యం(గోడ) ఉన్న విషయాన్ని ఇటీవలే గుర్తించారు. ఇది మూడు కిలోమీటర్ల నిడివితో కోటచుట్టూ విస్తరించి ఉంది. మల్లూరు గుట్ట చుట్టూ ఉన్న గడెలగుట్ట, సంగంపల్లి మొకిరెగుట్ట, గుడ్డేలుగాల గుట్ట, నర్సింహస్వామి బాడువల గుట్టలున్నాయి. వీటన్నింటిని మల్లూరు గుట్టలుగానే పరిగణిస్తారు. కాకతీయులు వారి చివరి అంకంలో సేన బస్తర్‌కు వలస వెళ్లే క్రమంలో కొంతకాలం ఇక్కడే ఉండేందుకు రక్షణ కోసం కోట చుట్టూ గోడ నిర్మించినట్లు తెలుస్తోంది. గుట్టపై సుమారు మూడు వేల గుహలు, ప్రతి గుహలో నీటితొట్లు ఉన్నాయి. వీటిని కాకతీయ రాజులు గుర్రపు శాలలుగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. మల్లూరు గుట్ట లక్ష్మీనరసింహస్వామివారు, అమ్మవార్ల నగ...

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ

Image
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ   >> మంత్రుల వూళ్లలో బహిరంగ సభలు >> తెలంగాణ తెదేపా సమావేశంలో నిర్ణయాలు : రేవంత్‌రెడ్డి    హైదరాబాద్‌ : తెరాస ప్రజావ్యతిరేక పాలనపై నిరవధిక ప్రజా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఎల్‌.రమణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలుగుయువత అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్‌, బోడ జనార్దన్‌లు విలేకరులకు వివరించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలోకి వస్తే నిజాం చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామన్న కేసీఆర్‌ ఇప్పుడు మౌనం వహించారని విమర్శించారు. తొలుత గజ్వేలులో సభ ప్రారంభించి, కేసీఆర్‌ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తా...

జల్లికట్టు విషాదం: ఇద్దరి మృతి

Image
జల్లికట్టు విషాదం: ఇద్దరి మృతి చెన్నై:  భారీ ఆందోళనల అనంతరం తమిళనాడులో తిరిగి ప్రారంభమైన జల్లికట్టు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  పుదుకొట్టై జిల్లాలోని రాపూసల్ గ్రామంలో ఆదివారం జల్లికట్టు ఆడుతుండగా ఇద్దరు మృతిచెందారు. ఎద్దును లొంగదీసుకునే ప్రయత్నంలో రాజా(30), మోహన్ (30) అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇదే ఘటనలో మరో మరో 57మందికిపైగా గాయాలయ్యాయి.150కిపైగా ఎద్దులతో మూడున్నర గంటలు జల్లికట్టును నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్‌ భాస్కర్‌ ఈ జల్లికట్టును ప్రారంభించారు. ఆయన సమక్షంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇదిలాఉంటే, జల్లికట్టుకు ప్రధాన కేంద్రమైన మదురై జిల్లా అలంగానల్లూరులో క్రీడా పోటీలు అనూహ్యంగా రద్దయ్యాయి. సీఎం పన్నీర్‌ సెల్వం నేటి ఉదయం జెండా ఊపి జల్లికట్టును ప్రారంభించేందుకురాగా, "శాశ్వత పరిష్కారం వచ్చే వరకు క్రీడను ప్రారంభించవద్దు" అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జెండా ఊపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక తిరుచిరాపల్లి జిల్లా పుడుపట్టి గ్రామంలో వంద ఎద్దులతో 500 మంది క్రీడాకారులు జల్లికట...

హైదరాబాద్ లో అనూహ్య ప్రమాదం

Image
హైదరాబాద్ లో అనూహ్య ప్రమాదం హైదరాబాద్: ఊహించని ప్రమాదం పాదచారి ప్రాణం తీసింది. రోడ్డు దాటుతుండగా ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ఆటో నేరుగా వచ్చి గుద్దడంతో పాదచారి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ అనూహ్య ఘటన పాతబస్తీలోని శంషేర్‌ గంజ్‌ లో చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఆటో ఒక్కసారిగా అతడిపైకి దూసుకువచ్చింది. నేరుగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఆటో ముందు టైరు ఊడిపోయి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఊహించని విధంగా ప్రమాదం జరగడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మృతుడి వివరాలు వెంటనే తెలియరాలేదు. ఆటోలో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదని వీడియో రికార్డైన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పరిహారం దందా!

Image
పరిహారం దందా! భీమా రెండోదశలో ఘరానా మోసం   చెల్లించిన స్థలాలకే  మళ్లీ ఇచ్చేందుకు నోటిఫికేషన్‌   మూడేళ్ల తర్వాత మరోసారి తాజాగా జారీ   20 కోట్లు నొక్కేసేందుకు దళారుల పావులు   అధికారుల కుమ్మక్కు.. ఖాళీ స్థలాలకేనని బుకాయింపు   రంగసముద్రం రిజర్వాయర్‌ పేరిట చేతివాటం   బినామీలు 70 మంది!.. కొత్త జిల్లాలతో కొత్త మోసం   మళ్లీ పరిహారం వస్తుండటంతో మిన్నకున్న గ్రామస్థులు ప్రభుత్వ భూమినే ప్రభుత్వానికి ఇచ్చినట్లు చూపించి పరిహారం పొందడానికి కుట్ర పన్నారు.  - ఇది మల్లన్న సాగర్‌లో దళారుల మాయ  మూడేళ్ల కిందట పరిహారం ఇచ్చిన గ్రామానికే మళ్లీ పరిహారం ఇచ్చేందుకు ఎత్తు వేశారు. రూ.20 కోట్లు  నొక్కేయడానికి పావులు కదిపారు.  -ఇది ఇప్పుడు భీమా ఫేజ్‌-2లో జరుగుతున్న ఘరానా భూమాయ   వనపర్తి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అవినీతి చీడపట్టింది. అధికారులు, దళారులు కుమ్మక్కయ్యారు. వారికి గ్రామస్థుల అత్యాశ తోడయింది. ఇంకేముంది.. మూడేళ్ల కిందటే అవార...

వేసవి రద్దీ తట్టుకునేందుకు వివిధ మార్గాల్లో 160 ప్రత్యేక రైళ్లు

Image
వేసవి రద్దీ తట్టుకునేందుకు వివిధ మార్గాల్లో 160 ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌: వేసవి రద్దీని తట్టుకునేందుకు వివిధ మార్గాల్లో 160 ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణమధ్యరైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్‌-విజయవాడ, హెస్‌.ఎస్‌.నాందేడ్‌-తిరుపతి, కాచిగూడ-టాటానగర్‌, హౌరా-ఎర్నాకులం మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌-విజయవాడ-సికింద్రాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌  సికింద్రాబాద్‌-విజయవాడ సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07757) సికింద్రాబాద్‌ నుంచి ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్‌ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్‌ 4, 11, 18, 25వ తేదీల్లో ఉదయం 5.30గంటలకు బయల్దేరి, అదే రోజు ఉదయం 10.45గంటలకు విజయవాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో... విజయవాడ-సికింద్రాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07758) విజయవాడ నుంచి ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్‌ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్‌ 4, 11, 18, 25వ తేదీల్లో సాయంత్రం 5.30గంటలకు బయల్ద...

టీఆర్‌ఎస్‌ ప్రచారానికి వేదికైన అసెంబ్లీ

Image
టీఆర్‌ఎస్‌ ప్రచారానికి వేదికైన అసెంబ్లీ ఏ అంశంపైనా అర్థవంతమైన చర్చ జరగలేదు అయినా హరీశ్‌రావు గొప్పలు చెప్పుకొంటున్నారు జానారెడ్డి శభాష్‌ అనలేదు: భట్టి విక్రమార్క హైదరాబాద్‌: శీతాకాల అసెంబ్లీ సమావేశాలను టీఆర్‌ఎస్‌.. ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకుందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సమావేశాలు 18 రోజులు జరిగినా, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అర్థవంతమైన చర్చ జరిగేందుకు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ ఎంతగా ప్రయత్నించినా అధికార పక్షం సమాధానం చెప్పలేదని అన్నారు. అయినా.. తెలంగాణ అసెంబ్లీ దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ మంత్రి హరీశ్‌రావు గొప్పలు చెప్పుకొంటున్నారని భట్టి విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘సభ మొత్తం 94.56 గంటలు జరిగింది. ఇందులో సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ సభ్యులు 50.49 గంటలు మాట్లాడారు. సభలో టీఆర్‌ఎస్‌ ఫ్రెండ్లీ పార్టీలు బీజేపీ, ఎంఐఎం మాట్లాడిన సమయం పోను కాంగ్రె్‌సకు ఇచ్చింది కేవలం 19 గంటలే. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును చూసి నవ్వాలో, ఏడవాలో కూడా అర్థంకావడంలేదు.’ అని భట్టి వ్యాఖ్యానించారు. మంత్...

జల్లికట్టుకు, ఏపీ ప్రత్యేక హోదాకు లింకుపెట్టిన పవన్.!

Image
జల్లికట్టుకు, ఏపీ ప్రత్యేక హోదాకు లింకుపెట్టిన పవన్.! హైదరాబాద్: జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్పూర్తిదాయకమని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జల్లికట్టుకోసం ప్రజలు కులమతాలకు అతీతంగా తమిళులంతా పోరాడిన తీరు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు పవన్. ఆంధ్రా నాయకులు కూడా అలాంటి సంఘీభావాన్ని ప్రకటించాలని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.జల్లికట్టుపై నిషేదానికి నిరసనగా లక్షలాదిమంది మెరీనాబీచ్‌‌ చేరినప్పటికీ ఎక్కడ హింసకు తావులేకుండా నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. తమిళుల సంఘటిత శక్తి, అహింసాయుతమైన పద్ధతి నన్ను కదిలించాయని లేఖలో పవన్ పేర్కొన్నారు. జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో " ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. అయితే వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉండి రాజకీయ నిబద్దత తక్కువగా ఉన్న మన రాజకీయ నేతలు తమిళ ఉద్యమం నుంచి ఎంత వరకు స్పూర్తి పొందురనేదానిపై నాకు కొన్ని సందేహాలున్నాయి.. అయితే ఈ విషయంలో రాజకీయ నేతలు రాజీపడినా ప్రజలు మాత్రం రాజీపడబోరన్న గట్టి నమ్మకం నాకుందని పవన్ లేఖలో ప్రస్తావించారు.

► పట్టాలు తప్పిన హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌

Image
► పట్టాలు తప్పిన హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ అర్థరాత్రి 37 మంది ప్రాణాలను గాల్లో కలిపిన రైలు ప్రమాదం. బోగిల్లో నలిగిపోయిన మృతదేహాలు. విజయనగరం లో ఘటన. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ► 25 మృతదేహాలు వెలికితీత.. బోగీలు నుజ్జునుజ్జు ► విజయనగరం జిల్లా కొమరాడ వద్ద అర్ధరాత్రి ప్రమాదం ► 100 మందికి పైగా తీవ్రగాయాలు ► 8 బోగీలు బోల్తా.. ఒక ఏసీ బోగీ సహా ఐదు బోగీలు పూర్తిగా నుజ్జునుజ్జు విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్తున్న హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీనితో ఇంజన్‌ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయానికి 25 మృతదేహాలను వెలికితీశారు. పలు బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సుమారు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది. ఎస్‌.6, ఎస్‌.7 స...